Friday, September 20, 2024

NZB: క్రీడల అభివృద్ధికి కేంద్రం కృషి.. ధర్మపురి అరవింద్

సైక్లింగ్ లీగ్ పోటీలను ప్రారంభించిన ఎంపీ
నిజామాబాద్ ప్రతినిధి, సెప్టెంబర్ 14(ప్రభ న్యూస్) : కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేలా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తుందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శనివారం నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో ఖేలో ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌత్ జోన్ మహిళల సైక్లింగ్ లీగ్ పోటీలను ఎంపీ ధర్మపురి అరవింద్ జెండా ఊపి ప్రారంభించాను. ఖేలో ఇండియా ద్వారా నిజామాబాద్ లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, అసిస్టెంట్ డైరెక్టర్ స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ కుమారి నిషా విద్యార్థి, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఈగ సంజీవరెడ్డి, నిజామాబాద్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కృపాకర్ రెడ్డి, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయకాంతరావు, వందలాది మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement