Monday, October 7, 2024

TG | గురుకుల పాఠశాల వద్ద కారు భీభత్సం.. ఇద్దరు మృతి

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దాస్ నగర్ సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. బాలికల గురుకుల పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు బాలికలకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

దాస్ నగర్ సమీపంలో వ‌ద్ద బాలికల గురుకుల పాఠశాల ఉండడంతో తల్లిదండ్రులు ఆదివారం పిల్లలతో మాట్లాడేందుకు వచ్చారు. రోడ్డు పక్కన బాలికలతో కలిసి తిరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ విద్యార్థిని తల్లి, మరో విద్యార్థి అమ్మమ్మ మృతి చెందారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. జ్యోతిభా పూలే పాఠశాల ఏఆర్‌వో సత్యనారాయణరెడ్డి విద్యార్థులను, మృతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement