Friday, October 18, 2024

NZB | ఇందూరులో రావణ దహనం.. పాల్గొన్న ఎమ్మెల్యే ధ‌న్‌పాల్

నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీక అని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం 10వ డివిజన్ నాగారం 50 క్వార్టర్స్‌లో వీర యూత్ దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ గృహ కల్ప మండపం వ‌ద్ద రావణ దహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ రావణ దహన కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై రావణ దహనం చేశారు. నాగారంలో ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమంలో ప్రజలు కేరింతలు కొడుతూ, రావణ దహన దృశ్యాలను సెల్‌ఫోన్‌లో బంధిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement