Friday, September 6, 2024

NZB: భట్టి మాటలన్నీ ఉత్తమాటలే – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ ప్రతినిధి, జులై 25(ప్రభ న్యూస్) : భట్టి విక్రమార్క చెప్పే మాటలన్నీ ఉత్తమాటలేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
సూర్యనారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అనంతరం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని బద్నామ్ చేస్తూ అసెంబ్లీలో పెట్టిన తీర్మానం వెనుక ఉన్న మతలబ్ ఏంటో తెలంగాణ ప్రజలకు ఈ రోజు తేటతెల్లమైంద‌న్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లు, 420 హామీల నుండి తప్పించుకునేందుకు రేవంత్ సర్కార్ చేసిన కుట్రలో భాగమే నేడు ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ నిదర్శనమ‌న్నారు.

తెలంగాణాలో ఇండ్లు లేని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న వారికీ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళల్లో కారం కొట్టిందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో 10ఏళ్ళు మోసం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మళ్లీ మోసం చేస్తుందని, స్థలం ఉన్నవారికి రూ.5లక్షలు ఎస్సి, ఎస్టీలకు 6లక్షలు నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తామని దానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎటువంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచ చేయాలి అని డిమాండ్ చేసారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement