Saturday, June 29, 2024

NZB: మురికి కాల్వ పక్కన పసికందు మృతదేహం…

రెండు రోజుల ఆడ శిశువు మృతదేహం కలకలం…
హృదయ విదారక ఘటన

నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 22(ప్రభ న్యూస్) : మానవత్వం మంటగలిసిన వేళ.. క్రూరత్వం జటలు వాసి అభం శుభం తెలియని.. అప్పుడే పుట్టిన రెండు రోజుల ఆడ శిశువు పసికందుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మూడవ 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాముల బస్తీలో డ్రైనేజీ పక్కన పారవేసిన ఘటన కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఇవాళ‌ ఉదయం డ్రైనేజీ పక్కన పడి ఉన్న రెండు రోజుల ఆడ‌ శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శిశువు మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement