Friday, October 18, 2024

NZB: సేవకు మారు పేరు ఆర్యవైశ్యులు… ఎమ్మెల్యే ధన్పాల్

నిజామాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 13 (ఆంధ్రప్రభ) : సేవా కార్యక్రమాల్లో ఆధ్యా త్మిక, కార్యక్రమాల్లో ఆర్య వైశ్యులు ఎల్లప్పుడూ ముం దుంటారని, సేవకు మారు పేరు ఆర్య వైశ్యులని కాశి అన్న పూర్ణ ఆర్యవైశ్య సత్రం ప్రధాన కార్యదర్శి, బచ్చు విలాస్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయక నవ రాత్రి ఉత్సవాలు, దుర్గా మాత నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిం చినందుకు అభినందించారు.

ఆర్య వైశ్యులు ఐక్యంగా ఉండాలని ఐక్య తతోనే ఏదైనా సాధ్యమని వారు కోరారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని గంజి ప్రాంతంలో గల ఆర్యవైశ్య పట్టణ సంఘ భవనంలో ఆర్యవైశ్య పట్టణ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా స్నేహ సమ్మేళన(అలయ్ బలయ్) కార్యక్రమానికి కాశి అన్నపూర్ణ ఆర్యవైశ్య సత్రం ప్రధాన కార్యదర్శి, బచ్చు విలాస్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ముఖ్య అతిథులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాశి అన్నపూర్ణ ఆర్యవైశ్య సత్రం ప్రధాన కార్యదర్శి, బచ్చు విలాస్ మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాల్లో ముందుండే అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నా బాల్యమిత్రుడని ఈ సందర్భంగా తెలిపారు. నిరుపేద ఆర్య వైశ్యులు, పేద విద్యార్థుల విద్యాభివృద్ధికై ఆర్య వైశ్యు లు ముందుండాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పేరు మార్చాలనే నిర్ణయంపై ఆర్యవైశ్యులు ముక్త కంఠంతో పోరాడాలని అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకు వచ్చే పొట్టి శ్రీరాములు పేరు మార్పు చేయడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతానికో… రాష్ట్రానికో చెందినవారు కాదని గుర్తించాలన్నారు. ఈ కార్యక్ర మంలో ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ గుప్తా, ఆర్గజింగ్ సెక్రటరీ దేవతా చంద్రశేఖర్ (చందు), గజవాడ శ్రీనివాస్, ధన్పాల్ శ్రీనివాస్, పార్షి మారుతి, మహంకాళి విజయ్, దొంతుల రాణా ప్రతాప్ గుప్తా, టీఆర్పీ శ్రీనివాస్, సిద్ధంశెట్టి విజయ్ గుప్తా, లాబిశెట్టి శ్రీనివాస్ గుప్తా, ప్రవీణ్ కుమార్ గుప్తా, పట్టణ సంఘ సభ్యులు, అనుబంధ సంఘాల సభ్యులు, ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement