Thursday, September 19, 2024

NZB: అభివృద్ధికి నిధులు కేటాయించండి.. సీఎంను కోరిన ఎమ్మెల్యే ధ‌న్ పాల్

నిజామాబాద్ ప్రతినిధి, జులై 30(ప్రభ న్యూస్) : నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కోరారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఛాంబర్ లో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి అర్బన్ నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి అర్బన్ ఎమ్మెల్యే తీసుకెళ్లారు.

అర్బన్ లో రోడ్స్ అండ్ డ్రైనేజీ అస్తవ్యస్థంగా ఉన్నాయని, నగరంలో తాగునిటీ సమస్య స్టాంవాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర అంశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించారు. ఎస్ డి ఎఫ్ ఫండ్ రూ.పది కోట్లు వెంటనే విడుదల చేయాలని అర్బన్ ఎమ్మెల్యే దాంపల సూర్యనారాయణ ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement