Friday, September 6, 2024

NZB: బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్

నిజామాబాద్, ఫిబ్రవరి 12 (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా (రెవెన్యూ) ఎస్.కిరణ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్ కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్ కు స్వాగతం పలికి, పరిచయం చేసుకున్నారు.

నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా కొనసాగిన పి.యాదిరెడ్డిని బదిలీచేస్తూ, ఆయన స్థానంలో ఎస్.కిరణ్ కుమార్ ను నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా ప్రభుత్వం ఇటీవలే పోస్టింగ్ కల్పించింది. ఈ మేరకు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సోమవారం ఇక్కడికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలుకుతూ, శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement