Friday, October 18, 2024

NZB | కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ధ్వంసమైన కారు

నిజామాబాద్ క్రైమ్, (ఆంధ్రప్రభ) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో కారుని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో కారు ధ్వంసమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్పల్లి మండలం హోన్నాజీపేట గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ గౌడ్ పనుల నిమిత్తం నిజామాబాద్ కి వచ్చాడు.

గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో కారులో లక్ష్మీ నారాయణ గౌడ్ వెళ్తున్న క్రమంలో ఆకస్మాత్తుగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కారు సైడ్ భాగము ధ్వంసమై టైర్ పేలింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధితుడు వాపోయాడు. ఈ రోడ్డు ప్రమాదంలో ఏలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బాధితుడు స్థానిక ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధి తుడి ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement