Friday, September 6, 2024

Nizamabad యువకుడి దారుణ హత్య..

నిజామాబాద్ ప్రతినిధి జూలై (ప్రభ న్యూస్) 17: నిజామాబాద్ నగరంలో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. బుధ వారం తెల్లవారుజామున వినాయక్ నగర్ ప్రాంతంలోని టీ స్టాల్ వద్ద రక్తపు మడు గులో యువకుడు మృతదేహాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యా రు. దీంతో పోలీసులకు సమాచారం అందజేయడంతో హుటా హుటిన పోలీ సులు అక్కడికి చేరుకున్నారు. మంగళ వారం రాత్రి యువకుడిని హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తు న్నారు.

ఈ సందర్భంగా ఏసీపి ,ట్రాఫిక్ ఏసిపి సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు గురైన యువకుడి మృతదేహాన్ని పరిశీలించారు. వెంటనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్స్ బృందాన్ని పిలిపించారు. హత్య కు గల కారణాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement