Thursday, September 19, 2024

Nimajjanam – గంగమ్మ ఒడికి చేరుకున్న ఖైరతాబాద్‌ మహా గణపతి

హైదరాబాద్లో ఖైరతాబాద్‌ మహా గణపతి సహా వినాయక విగ్రహాల నిమజ్జనం భక్తజనుల సందడి మధ్య ఘనంగా కొనసాగింది. శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా, పది రోజుల పాటు భక్తుల నీరాజనాలందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు గంగఒడికి చేరుకున్నాడు.

70 అడుగుల ఎత్తులో భారీ కాయుడై, ప్రపంచ రికార్డు సృష్టించిన బొజ్జ గణపయ్యకు సోమవారం రాత్రి 10 గంటలకు చివరిసారిగా కలశపూజ నిర్వహించిన తర్వాత, పార్వతీ తనయుడిని టస్కర్‌పైకి చేర్చారు. స్వామివారికి ఇరువైపులా ఉన్న దేవతాముర్తుల విగ్రహాలను ట్రాలీలపైకి చేర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తైన తర్వాత, ఖైరతాబాద్‌ నుంచి శోభాయాత్ర ప్రారంభించారు.

- Advertisement -

భక్తుల కొంగుబంగారమై పది రోజుల పాటు, నీరాజనాలందుకున్న మహాకాయుడి నిమజ్జనానికి భారీగా భక్తజనం తరలివచ్చారు. ఈ మహాక్రతువు సందర్భంగా బందోబస్తులో 700 మంది పోలీసులు పాల్గొనగా, 56 సీసీటీవీ కెమెరాలతో పహారా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement