Sunday, October 6, 2024

New Delhi – భారత్ నెట్ ఫేజ్-3లో టి ఫైబ‌ర్ ప్రాజెక్ట్ ను చేర్చండి – రేవంత్

న్యూ ఢిల్లీ – టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్-3లో చేర్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్నరేవంత్ సహచర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావుతో క‌ల‌సి నేడు సింధియాను ఆయ‌న కార్యాల‌యంలో క‌లిశారు..

తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలు, మండలాలకు టీ ఫైబర్ నెట్ వర్క్ కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని కేంద్రమంత్రికి రేవంత్ తెలిపారు. 65 వేల ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించడడ‌మే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశ‌గా ముందుకు సాగుతున్నామ‌ని చెప్పారు.. ఈ నేప‌థ్యంలోనే టి ఫైబ‌ర్ ప్రాజెక్ట్ ను బార‌త్ నెట్ ఫేజ్ 3 లో చేర్చాల‌ని కోరుతూ డిపిఆర్ ను కేంద్ర మంత్రికి స‌మ‌ర్పించారు.. దీనిని ఆమోదించాల‌ని కోరారు.. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తామ‌ని హామీ ఇచ్చారు.

- Advertisement -

అనంతం మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాలు, మండలాలకు నెట్‌వర్క్‌ కల్పించడమే టీ ఫైబర్‌ లక్ష్యమన్నారు. 65 వేల ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు

.”పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తాం. నెలకు రూ.300కే ఇంటర్నెట్‌, కేబుల్‌ టీవీ, ఈ- ఎడ్యుకేషన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం. టీ-ఫైబర్‌ అమలుకు ఎన్‌ఎఫ్‌ఓఎన్‌ సహకారం అవసరం. భారత్‌ నెట్‌ పథకాన్ని టీ-ఫైబర్‌కు వర్తింపజేయాలి. టీ-ఫైబర్‌కు రూ.1,779 కోట్ల వడ్డీ లేని రుణం ఇవ్వాలి” అని.కేంద్రాన్ని కోరామని సీఎం చేప్పారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement