Tuesday, September 17, 2024

TG: ఫామ్ హౌస్ లో కేసీఆర్ దంప‌తుల న‌వ‌గ్ర‌హ యాగం..

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ అధినేత కెసిఆర్ సిద్దిపేట ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ప్రత్యేక పూజలు వేద పండితుల సమక్షంలో నవగ్రహ యాగం చేయించారు కెసిఆర్ దంపతులు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.

ఇది ఇలా ఉంటే కేసీఆర్ త్వరలో పర్యటనలు సిద్దమవుతున్నట్లు సమాచారం.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. రైతుల విషయంలో అలాగే ఇతర విషయాలలో లో దారుణంగా విఫలమైందని కేసీఆర్ ఇప్పటికే గుర్తించారట. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల సమక్షంలో నిలదీసేందుకు కేసీఆర్ బయటకు వస్తున్నారు. వినాయక చవితి తర్వాత బస్సు యాత్రలు చేయనున్నారట. వినాయక చవితి రోజున ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేయబోతుంది గులాబీ పార్టీ.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement