Wednesday, October 23, 2024

TG | నారాయ‌ణ క‌ళాశాల విద్యార్థి దుర్మ‌ర‌ణం

  • ఐదో అంత‌స్థు నుంచి ప‌డిన శివ‌కుమార్ రెడ్డి
  • మాదాపూర్ క‌ళాశాల‌లో ఘ‌ట‌న‌


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : హైద‌రాబాద్ సిటీ మాదాపూర్ నారాయ‌ణ క‌ళాశాలలో ఇంట‌ర్ విద్యార్థి శివ‌కుమార్ రెడ్డి ఐదో అంత‌స్థుపై నుంచి కింద‌కు ప‌డిపోయి దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని క‌డ‌ప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన శివ‌కుమార్ రెడ్డి మాదాపూర్ నారాయ‌ణ క‌ళాశాల‌లో ఇంట‌ర్మీడియెట్ చ‌దువుతున్నాడు.

బిర్యానీ కోస‌మ‌ని…
నారాయ‌ణ క‌ళాశాల ఐదో అంత‌స్థులో ఉన్న హాస్ట‌ల్‌లో ఉంటున్న విద్యార్థి శివ‌కుమార్ రెడ్డి బిర్యానీ తినేందుకు కిటికీ గ్రిల్ తొల‌గించి కింద‌కు దిగే ప్ర‌య‌త్నంలో కాలుజారి కింద‌కు ప‌డిన‌ట్లు క‌ళాశాల య‌జ‌మాన్యం తెలిపింది. క‌ళాశాల యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యం వ‌ల్లే విద్యార్థి మృతి చెందాడ‌ని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. నారాయ‌ణ క‌ళాశాల చుట్టూ మూడంచెల పోలీసుల భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement