Friday, September 13, 2024

TS: నల్లమలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి.. జూపల్లిని కోరిన బొజ్జ అమరేందర్‌రెడ్డి

అచ్చంపేట, జూలై 5, ప్రభ న్యూస్ : మైమరిపించే ప్రకృతి రమణీయతతో పాటు ఎన్నో వనరులు పుష్కలంగా ఉండి అందరికీ అందుబాటులో ఉండే నల్లమల్ల ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ అడ్వయిజరీ కమిటి మెంబర్‌ బొజ్జ అమరేందర్‌రెడ్డి కోరారు. శుక్రవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును బొజ్జ అమరేందర్ రెడ్డి ప్రత్యేకంగా కలిశారు.

నల్లమలను పర్యాటకంగా తీర్చిదిద్దడానికి ఆలోచన చేయడం గొప్ప విషయమని, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నేతృత్వంలో ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నల్లమల లో పర్యటన చేయడం శుభసూచకమన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లికి నల్లమల ప్రాంత పరిస్థితులను బొజ్జ అమరేందర్ రెడ్డి వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ సమక్షంలో నల్లమలను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని ఆయన కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement