Sunday, September 8, 2024

NLG: కాంగ్రెస్‌, బీజేపీ మాయలో పడొద్దు.. సునీత జగదీష్ రెడ్డి

సూర్యాపేట, ప్రభ న్యూస్ : కాంగ్రెస్‌, బీజేపీ మాయలో పడొద్దు.. మరోసారి పడి లోక్ స‌భ‌ ఎన్నికల్లో మోసపోవద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సతీమణి, ఎస్ ఫౌండేషన్ చైర్మెన్ సునీత జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండ లోక్ సభ బీఆర్ఎస్‌ అభ్యర్ధి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా సూర్యాపేట 38, 35 వార్డ్ లలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గడప గడపకు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఆరు గ్యారెంటీలంటూ మభ్యపెట్టి ప్రజలను కాంగ్రెస్ నిలువునా ముంచిందన్నారు. తెలంగాణాకు కేసీఆరే శ్రీరామరక్ష అన్నారు.

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున మీ పక్షాన ప్రశ్నించే గొంతుకగా కంచర్ల కృష్ణారెడ్డికి అవకాశమివ్వాలని కోరారు. ఉత్తమాటలు.. ఉద్దెరహామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ను మరోసారి నమ్మి మోసపోవద్దని, పదేళ్ల పాలనలో తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ మాయలో పడొద్దని కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి అంటే కేసీఆర్‌ సర్కార్‌దేనని, పదేండ్ల పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ పనైపోయిందని తీవ్రంగా విమర్శించారు. తాము ఓటు ఎందుకు వేశామని ప్రజలు బాధపడుతున్నారని, నాలుగు నెలల్లోనే అసహ్యించుకునే దుస్థితి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పేరుమాళ్ళ అన్న పూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, నాయకులు అంగిరేకుల నాగార్జున, ఆకుల లవకుశ, కెక్కేరేణి నాగయ్య, భైరు వెంకన్న, వల్దస్ జాని, తాహెర్ పాషా, బత్తుల జాని, రాపర్తి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement