Thursday, October 3, 2024

NLG: డిజిటల్ కుటుంబ సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలి.. క‌లెక్ట‌ర్

మద్దిరాల, అక్టోబర్ 3 (ప్రభ న్యూస్) : తెలంగాణ డిజిటల్ కుటుంబ సర్వేను ప‌క‌డ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఫ్యామిలీ కార్డు కోసం మండల పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో గురువారం పైలెట్ ప్రాజెక్టు కింద ఇంటింటిసర్వే నిర్వహించగా సర్వేను పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఈఓ అప్పారావు, త‌హ‌సీల్దార్ అమీన్ సింగ్, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, ఏపీ ఎం మైసయ్య, పంచాయతీ కార్యదర్శులు పుష్ప ఉమా రాజ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement