Tuesday, September 17, 2024

TG | వరదల్లో కాపాడిన హీరో.. సన్మానించిన అసదుద్దీన్

ఖమ్మం జిల్లా ప్రకాష్ నగర్ లో వరదల్లో చిక్కుకున్న 9 మందిని రక్షించిన జేసీబీ డ్రైవర్ సుభాన్ తెగింపును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభినందించారు. సుభాన్ ధైర్యసాహసాలను మెచ్చుకున్న అసదుద్దీన్ రూ.51000 నగదు బహుమతితో సత్కరించారు. తన ప్రాణాలు లెక్కచేయకుండా మరో 9 మంది ప్రాణాలు రక్షించిన సుబాన్ కు ఖమ్మంలో డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అసదుద్దీన్ సిఫారసు చేశారు.

ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అంతలోనే హరియాణావాసి సుభాన్ ఖాన్ చాకచక్యంగా వ్యవహరించి జేసీబీని వరద ప్రవాహంలో ముందుకు పోనిచ్చి, ఆ తొమ్మిది మందిని జేసీబీతో బయటకు తీసుకువచ్చి రక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement