తిరుమలగిరి, ఆగస్టు 29 (ప్రభ న్యూస్) : వ్యవసాయ మార్కెట్ కు గురువారం 1237 బస్తాల పెసర్లు రాగా, చిన్న వంగర గ్రామానికి చెందిన రైతు బీకోజి రెండు క్వింటాళ్ల 70కిలోల పెసర్లు తీసుకురాగా.. క్వింటా 8500 రికార్డ్ స్థాయిలో ధర పలికింది.
22,950 రూపాయలు వచ్చినాయని రైతు తెలిపారు. 175 మంది రైతులు పెసర్లు మార్కెట్ కు తీసుకువచ్చి విక్రయించుకున్నారు. కనిష్ట ధర 5200, మధ్యరకం ద్వారా 6749 వచ్చిందని మార్కెట్ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు.
- Advertisement -