Sunday, October 6, 2024

Nalgonda – ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా …

నల్లగొండ: నల్లగొండ పట్టణంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌ రోడ్డు చంద్రగిరి విల్లాస్‌ కాలనీకి వెళ్లే దారి వద్ద వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపుతప్పి పల్టీలు కొట్టి బోల్తా పడిపోయింది.

దీంతో 20 మంది గాయపడ్డారు. సమాచారం అందుకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement