Saturday, October 19, 2024

Nalgonda – మిష‌న్ భ‌గీర‌థ‌లో వేల కోట్లు మింగేశారు – మంత్రి కోమ‌టిరెడ్డి

నల్గొండలో ఫ్లోరైడ్ పెరిగింది
ఈ పాపం కేసీఆర్‌దేన‌న్న మంత్రి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ :
నల్గొండలో ఫ్లోరైడ్ పెరిగిందని మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి అన్నారు. మిషన్ భగీరథ కింద ₹6 వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు చెబుతున్నవాళ్లు.. అందులో ₹5 వేల కోట్లు దోచుకున్నరని మంత్రి ఆరోపించారు. నల్గొండ ఫ్లోరైడ్​ పాపం కేసీఆర్​దేనని మంత్రి విమర్శించారు. న‌ల్గొండలో శనివారం మీడియాలో మాట్లాడుతూ.. నల్గొండ ప్రజలు రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్లు కాద‌న్నారు. బీఆర్​ఎస్​ నేత హరీశ్ రావు నాటకాల రాయుడని, పొద్దున లేస్తే పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి తాను, రేవంత్ రెడ్డి పైకొచ్చామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓఆర్ఆర్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లాంటివి కట్టామని ఎన్నో ఎంఎన్‌సీ సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఏర్పడ్డాయని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement