Monday, July 1, 2024

TS: నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై నెగ్గిన అవిశ్వాస తీర్మానం

నల్లగొండ, జూన్ 28, ఆంధ్ర‌ప్రభ ప్రతినిధి : ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై డైరెక్టర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన గొంగిడి మహేందర్ రెడ్డిని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ 14 మంది డైరెక్టర్లు కొద్దిరోజుల క్రితం డీసీఓ కిరణ్ కుమార్ కు అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చారు.

డైరెక్టర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం మేరకు శుక్రవారం ఉదయం 11 గంటలకు నల్లగొండ డీసీసీబీ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించగా 15మంది డైరెక్టర్లు మహేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో మహేందర్ రెడ్డి పదవి కోల్పోయినట్లు అయింది. నూతన చైర్మన్ ఎంపిక కోసం త్వరలో ఓటింగ్ నిర్వహించనున్నట్లు డీసీఓ తెలిపారు.

నూతన చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి : నల్లగొండ జిల్లా నూతన డీసీసీబీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి నియామకం కానున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement