Saturday, September 7, 2024

Nalgonda – అస్సాంలో నల్గొండ జవాన్ మృతి

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – నల్గొండ ప్రతినిధి – అస్సాం రాష్ట్రంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి చెందారు. నల్గొండ జిల్లా అనుముల మండలం మదారి గూడెం కి చెందిన జవాన్ ఇరటి మహేష్ అస్సాంలో ఉన్న ఆర్మీ జవాన్ గా విధులు నిర్వ హిస్తున్నాడు. అయితే వాతావరణం సరిగా లేకపోవడంతో… అక్కడ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు . దీంతో మహేష్ ను ఆసుపత్రికి తరలించిన తర్వాత చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. దీనిపై ఆర్మీ అధికారులు అధికారిక ప్రకటన చేశారు.

అస్సాం ప్రభుత్వం మృతదేహాన్ని… తెలంగాణకు పంపించేందుకు ఏర్పాటులు కూడా చేస్తోంది. చిన్న వయసులో మహేష్ మృతి చెందడంతో… మదారి గూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..

.

Advertisement

తాజా వార్తలు

Advertisement