Monday, July 1, 2024

Nagar Kurnul – కూలిన మట్టి మిద్దె – ముగ్గురు పిల్లలతో సహా నలుగురు దుర్మరణం

నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన నాగర్ కర్నూల్ మండలం వనపట్లలో జరిగింది.

ఆదివారం భారీ వర్షం కురవడంతో మట్టి మిద్దె కూలి తల్లి గొడుగు పద్మ (26) ఇద్దరు కూతుర్లు పప్పి(6) , వసంత (6) , ఒక కుమారుడు విక్కి మృతి చెందారు. తండ్రికి గాయాలు కాగా.. జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడడంతో ఆ గ్రామాన్ని విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరించారు.

- Advertisement -

.

Advertisement

తాజా వార్తలు

Advertisement