Wednesday, July 3, 2024

Nagar Kurnul – కూలిన మట్టి మిద్దె – ముగ్గురు పిల్లలతో సహా నలుగురు దుర్మరణం

మట్టి మిద్దె కూలి నలుగురు మృతి — భర్త పరిస్థితి విషంమం జిల్లా ఆస్పత్రికి తరలింపు — నాగర్ కర్నూల్ మండలం వనపట్ల లో ఘటన…

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (జులై 1 ) ప్రభా న్యూస్…మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు ఘటన నాగర్ కర్నూల్ మండలంలోని వనపట్ల గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

- Advertisement -

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం .. గొడుగు భాస్కర్, పద్మ (28)భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుర్లు పప్పి (6) వసంత (7) కుమారుడు విక్కీ (1 సంవత్సరం 3 నెలలు) ఉన్నారు. భాస్కర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే తిని ఇంట్లో పడుకున్నారు.సోమవారం తెల్లవారుజామున ఒకటి రెండు ప్రాంతంలో కురిసిన వర్షానికి ఇంటి పైకప్పు కూలి తల్లి ఇద్దరు కూతుర్లు,ఒక కుమారుడు అక్కడికి అక్కడే మృతి చెందారు. తండ్రి భాస్కర్ పరిస్థితి విషమంగా ఉండడంతో నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement