Saturday, September 21, 2024

Mulugu – వైబ్రంట్ అకాడమీలో విద్యార్థిని బలవన్మరణం

ప్రభ న్యూస్ ప్రతినిధి ములుగు విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హన్మకొండ వైబ్రంట్ ఆకాడమీలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన ఏనుముల భవాని రెడ్డి హనుమకొండ లోని వైబ్రంట్ అకాడమీలోఎంపిసీ మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే బుధవారం అర్ధరాత్రి భవాని రెడ్డి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

విషయాన్ని గమనించిన సమీప వ్యక్తులు విద్యార్థిని భవాని రెడ్డిని హనుమకొండలోని రోహిణి హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించే క్రమంలో మార్గ మధ్యలోనే మృతి చెందింది . విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు వైబ్రంట్ అకాడమీ ముందు ఆందోళనకు దిగారు. విద్యార్థి భవాని రెడ్డి మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా , కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం వరంగల్ ఎంజీఎం హాస్పటల్ కు పోలీసులు తరలించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement