Friday, October 18, 2024

NZB: ఎంపీ ధర్మపురి అరవింద్ క్యాంపు కార్యాలయం ముట్టడి..

నీట్ పరీక్షను రద్దు చేయాలని విద్యార్థి సంఘాల ఆందోళన
అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలింపు

నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 22(ప్రభ న్యూస్) : నీట్ పరీక్షను రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం నిజామాబాద్ నగరంలోని న్యూ ఎన్జీవోస్ కాలనీలో గల ఎంపీ ధర్మపురి కార్యాలయాన్ని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేయడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేదంటే దేశ వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement