Monday, September 16, 2024

TG: యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుపై.. ఎంపీ చామ‌ల‌ హర్షం

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయడం హర్షనీయమని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ… యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయడంపై భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

టీటీడీ అనుసరించిన తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ద్వారా స్వయం ప్రతిపత్తి, విధి విధానాలు ఉండేలా అవసరమైతే చట్ట సవరణ చేయడం ద్వారా యాదగిరిగుట్ట ఆలయం అభివృద్ధి జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించి ఆలయ అభివృద్ధికి కృషి చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement