Saturday, October 19, 2024

KNR | పదోన్నతి ద్వారా మరింత బాధ్యత.. రామగుండం సీపీ శ్రీనివాస్

రామగుండం, ఆంధ్రప్రభ : పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణా యుతంగా నిర్వహిస్తూ ప్రజల్లో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని పెంచే విధంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తూ ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన ఆరుగురికి ర్యాంకు చిహ్నాలను అందించారు.

అనంతరం మాట్లాడుతూ… ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కష్టపడి పనిచేసి పోలీసు శాఖకు మంచిపేరు తీసుకురావాలన్నారు. ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా మంచి గుర్తింపు లభిస్తుందని, ఇప్పటివరకు ఎలాంటి క్రమశిక్షణతో విధులు నిర్వహించారో అదేవిధంగా మిగతా సర్వీస్ పూర్తి చేసి మరిన్ని పదోన్నతులు పొందాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటాం, మానసికంగా శారీరకంగా ఒత్తిడిని దూరం చేయడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలని, మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ఏఆర్ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ లు దామోదర్, శ్రీనివాస్ లు, రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement