Monday, September 16, 2024

ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించాలి

ఆయిల్ ఫామ్ సాగుపై రాష్ట్ర రైతాంగానికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్ శాఖ సార్లు పూర్తిస్థాయిలో రైతులకు సహకరించాలన్నారు. అర్ఓఎఫ్అర్ భూముల్లో ఆయిల్ ఫామ్ సాగు కోసం ప్రభుత్వం సహకరించాలన్నారు. 9 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ దీనిపై రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల్లో వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని బాల్క సుమన్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement