Tuesday, September 24, 2024

Nalgonda : ప్రజాదర్బార్ లో విన‌తులు స్వీక‌రించిన‌ మంత్రి వెంకట్ రెడ్డి

నల్లగొండ : ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం నల్లగొండలో ప్రజాదర్బార్ నిర్వహించారు. క్యాంపు కార్యాలయం సమీపంలోని మున్సిపల్ పార్కులో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించి వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించారు.

కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేయగా.. మరికొన్ని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారమ‌య్యేలా కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన నల్లగొండ పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి, మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా నిర్మించాలన్న కౌన్సిల్ సమావేశం మందిరానికి శంకుస్థాపన చేశారు. గుండ్లపల్లి వద్ద డిస్ట్రిబ్యూటరీ 37కు నీటిని విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ సయ్యద్ మసాబ్ అహ్మద్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement