Thursday, September 5, 2024

TG: గోదావరి తీరాన మంత్రి పొంగులేటి పర్యటన…

ప్రజలకు చేయూతగా నిలవాలని యువజన శ్రేణులకు పిలుపు…
బూర్గంపహాడ్, జులై 22(ప్రభ న్యూస్) : మండల పరిధిలోని నాగినేని ప్రోల్ రెడ్డిపాలెం గ్రామ శివారు గుమ్మూరు ప్రాంతంలో గోదారి ఉదృతిని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు, వరద బాధితులకు అధికారులు అన్నివిధాలుగా ఏర్పాట్లు అందించాలన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన శ్రేణులు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు చేయూతగా తోడ్పాటునివ్వాలన్నారు.

గోదావరి ఉధృతి పెరిగేకొద్దీ లోతట్టు ప్రాంత ప్రజలను ఖాళీ చేయించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించాలని, అధికారులకు పునరావాస కేంద్రంలో అన్ని సౌకర్యాలు బాధితులకు కల్పించాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, తదితరులున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement