Friday, September 20, 2024

టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి కేటీఆర్ పరామర్శ

కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రేణికుంట టోల్గేటు వద్ద పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఇటీవలే మరణించిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త  కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల చెక్కుని అందించి, వారిని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణ రావు, తెలంగాణ రాష్ట్ర ఇఫ్ఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement