బాసర సరస్వతీ ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో నిర్వహంచినే వసంత పంచమి వేడుకల్లో పాల్గొని, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేదపండితులు తీర్ధప్రసాదాలు అందచేసి ఆశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..