Friday, September 20, 2024

TG: ఈనెల 12న జాంబియాకు మిమిక్రీ రమేష్..

హైద‌రాబాద్ : ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, సీనియర్ జర్నలిస్ట్ మిమిక్రీ రమేష్ ఈనెల 12వ తేదీన జాంబియా రాజధాని లుసాకా కు వెళ్లనున్నారు.. అక్కడి డ్రిల్లింగ్ కంపెనీస్ ఆధ్వర్యంలో నిర్వహించే గణేష్ ఉత్సవ కార్యక్రమానికి మిమిక్రీ రమేష్ కు ఆహ్వానం అందింది.. 13, 14 తేదీల్లో అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమాలకు మిమిక్రీ రమేష్ తో పాటు నల్లగొండ గద్దర్ నరసన్న, రేలారే గంగలు కూడా వెళుతున్నారు.. అక్కడి జాంబియా 5 క్యాపిటల్ సిటీ లూసాకలో అలీమార్ పార్క్, రోడ్స్ పార్క్ లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.. 15వ తేదీన నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది.

తనను తోటి కళాకారులు నల్లగొండ గద్దర్ నరసన్న, గంగలను జాంబియా రాజధాని విశాఖకు ఆహ్వానించిన డ్రిల్లింగ్ కంపెనీస్ అధినేతలకు మిమిక్రీ రమేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా తొలిసారి జాంబియాకు వెళుతున్న మిమిక్రీ రమేష్ ను పలువురు ప్రముఖులు అభినందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement