Saturday, September 21, 2024

వ్యాపారి లక్ష్మీకాంతరావు దారుణహత్య

మంచిర్యాల జిల్లా క్యాథనపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గద్దరాగడిలో వ్యాపారి నడిపెల్లి లక్ష్మీకాంతరావు (54)ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఆయన్ను కత్తులతో పొడిచి దారుణంగా చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement