Tuesday, October 22, 2024

TG | గవర్నర్ విష్ణుదేవ్ తో బీసీ సంఘాల భేటీ !

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం మూలంగా బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో జీవో నంబర్ 29 ద్వారా ఉద్యోగాల భర్తీలో బీసీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని బీసీ మేధావుల ఫోరం రాష్ట్ర కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు.

బీసీ సంఘాల ప్రతినిధుల బృందం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మను కలిశారు. ఈ సందర్భంగా బీసీ ప్రజాప్రతినిధుల బృందం బీసీ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement