Wednesday, September 25, 2024

Counselling – ఎంబిబిఎస్, బిడిఎస్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం

రేప‌టి నుంచి వెబ్ అప్ష‌న్లు షురూ
నాలుగు వేల సీట్ల కోసం 16,679 పోటీ
గ‌త ఏడాది సీట్ల కేటాయింపు వివ‌రాలు వెబ్ సైట్ లో

హైదరాబాద్: తెలంగాణ లో ఎంబిబిఎస్, బిడిఎస్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక , కన్వీనర్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న 16,679 మంది విద్యార్థులకు సంబంధించిన మెరిట్ లిస్ట్ ను నిన్న కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ లిస్ట్ పై ఏమైనా అభ్యంతరాలుంటే ఇవాళ సాయంత్రం లోపు వెబ్ సైట్ ద్వారా తెలియజేయాలని యూనివర్సిటీ వీసీ బి.కరుణాకర్ రెడ్డి తెలిపారు.


ఫైనల్ మెరిట్ లిస్ట్ రేపు విడుదల చేసి, అదే రోజు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభించనున్నట్టు తెలిపారు వీసీ. విద్యార్థులు అందరూ వెబ్ ఆప్షన్ల నమోదుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. గత ఏడాదికి సంబంధించిన సీట్ల కేటాయింపు వివరాలు కళాశాలల వారిగా వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ ఏడాది ప్ర‌వేశాల కోసం స్థానిక‌త నిర్ణ‌యించేందుకు జారీ చేసిన జీవో 33 పై కొందరూ కోర్టును ఆశ్రయించడంతో కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం అయింది. ఇటీవలే సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంలో కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement