Saturday, September 7, 2024

Medchal – న‌కిలీ గోల్డ్ కాయిన్స్ తో బురిడీ … న‌లుగురు అరెస్ట్

మేడ్చల్‌: నకిలీ బంగారు నాణేలు విక్రయిస్తున్న ముఠాను షాపూర్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ ధరకే గోల్డ్‌ కాయిన్స్‌ ఇస్తామని నమ్మించిన ముఠా సభ్యులు పలువురిని మోసం చేశారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 100 నకిలీ బంగారు నాణేలు, రూ.36లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో నకిలీ బంగారు నాణేలు తయారు చేయించి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వీటిని విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ ముఠా చేతిలో మోసపోయిన వారి వివరాలను షాపూర్‌ నగర్‌ పోలీసులు సేకరిస్తున్నారు. దీనిపై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement