Saturday, September 7, 2024

Medchal – పట్టపగలే న‌గ‌ల షాపులో దోపిడి..

మేడ్చల్ జూన్ 20 (ప్రభన్యూస్):మేడ్చల్ మున్సిపల్ పట్టణంలోని జగదాంబ జ్యువెల్లరీ షాపులో పట్టపగలే దొంగలు దోపిడికి పాల్ప‌డ్డారు.. పోలీస్ స్టేషన్ పక్కనే గల జగదాంబ జ్యువెల్లరీ షాపులో గుర్తు తెలియని దుండగులు బుర్కా ధరించి షాపు యజమాని శేశారంపై కత్తితో దాడి చేశారు. అత‌డి చాతీపై పొడిచి షాపులోని నగలను తన బ్యాగ్ లో వేయమని అరిచాడు . అనంత‌రం న‌గ‌ల షాపులోని బంగారు అభ‌ర‌ణ‌ణాల‌ను దోచుకువెళ్లారు.. దుకాణానికి వ‌చ్చిన‌ ఇద్దరు దుండగుల్లల్లో ఒకరు బుర్కా ధరించాడు.. వారు పల్సర్ బైక్ పై వచ్చారు . బంగారం దుకాణంలో చోటు చేసుకున్న ఘటనపై సిసి ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి.. దీంతో దుండగుల ఫోటోలు వెలుగు చూశాయి.. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడ చేరుకొని వివరాలు సేకరించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement