Thursday, September 12, 2024

Sangareddy: జిల్లాకు ఎల్లో అలర్ట్.. పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.. చెన్నూరి రూపేష్

భారీ వర్షాల దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.
జిల్లా ప్రజలు అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయండి.
పొంగి, పొర్లుతున్న వాగులు, చెరువులను చూడానికి వెళ్లారాదు..
అత్యవసరమైతే డైల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712656739కు కాల్ చేయండి.
కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షిస్తున్న జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్


సంగారెడ్డి, సెప్టెంబరు 1 (ప్రభ న్యూస్) : భారీ వర్షాల దృష్ట్యా సంగారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగిందని, జిల్లా ప్రజలు ఎవ్వరు కూడా పొంగి, పొర్లుతున్న వాగులు, చెరువులు, కుంటలను చూడానికి వెళ్లారాదని, అత్యవసరమైతేనే తప్ప ప్రయాణాలు చేయకూడదని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. జలాశయాలు నిండుకుండలా మారే అవకాశం ఉన్నందున ప్రమాద కారణాల దృష్ట్యా ఎవ్వరూ చెరువులు, కుంటలను చూడటానికి వెళ్లారాదని సూచించారు.

ఏదైనా ప్రమాదం తలెత్తినా, అత్యవసర సమయంలో స్థానిక పోలీసు స్టేషన్ కు లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656739 ను సంప్రదించవలసిందిగా జిల్లా ఎస్పీ సూచించారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, జిల్లా పోలీసు యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని, చెరువులు కుంటలకు చూడటానికి ఎవ్వరిని అనుమతించరాదని, ప్రమాద సూచిక బోర్డ్ లను ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. యస్.హెచ్.ఒ. లు ప్రత్యేకంగా తమ తమ ఏరియాలో ఉన్న చెరువులు కుంటలను సమర్శించి, ఆనకట్టలు ప్రమాద అంచున ఉన్నట్లయితే సమాచారం అందించాలన్నారు. లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపాలని పోలీసు అధికారులకు సూచనలు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement