Saturday, September 7, 2024

MDK: నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం.. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి ఒక్క‌రినీ ఆదుకుంటామ‌ని ఎమ్మెల్యే డా.మైనంప‌ల్లి రోహిత్ అన్నారు. మెదక్ నియోజకవర్గంలోని పాపన్నపేట మండలం మల్లంపేట గ్రామానికి చెందిన జకీరా బేగంకు రూ.2,00,000 లు, పాపన్నపేట మండలం యూసుఫ్ పేట గ్రామానికి చెందిన దూదేకుల తాహీమా కు రూ.2,50,000 ల ఎల్.ఓ.సి.లను ఎమ్మెల్యే అంద‌జేశారు.

అలాగే రామాయంపేట మండలం శివ్వాయిపల్లి గ్రామంలోని పి.పర్శరాములు కు రూ.2,50,000లు, హావేళిఘణపురం మండలం బొగుడ భూపతిపూర్ గ్రామానికి చెందిన జి.నాగమ్మ కు రూ.2,00,000 ల ఎల్.ఓ.సి.లను ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం మంగళవారం నియోజకవర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement