Sunday, September 8, 2024

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం : డీఎస్పీ జనార్ధన్

సంగారెడ్డి : జాతీయ ఓటర్ దినోవత్సవాన్ని పురస్కరించుకొని బుధ‌వారం సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో కార్యాలయ సిబ్బందితో కలిసి ఓటర్ ప్రతిజ్ఞను డీఎస్పి ఎన్.జనార్ధన్ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాజ్యాంగం మనకు కల్పించిన ఒక గొప్ప ఆయుధం ఓటు హక్కు అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఈ ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా.. క్రమం తప్పకుండా వినియోగించుకోవాలన్నారు. ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం మనవంతు పాత్ర పోషించి, దేశ అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి ఇన్స్పెక్టర్ జెలెంద‌ర్ రెడ్డి, కమ్యూనికేషన్ ఇన్ స్పెక్ట‌ర్ శ్రీదేవి, ఆర్ఐలు కృష్ణ, రామారావ్, డిపిఒ సూపరిటెండెంట్ వెంకటేశం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement