Friday, October 18, 2024

బాధితుడిని పరామర్శించిన ‘కృష్ణారెడ్డి’

జిన్నారం : పరిశ్రమలు ఎలాంటి భద్రత చర్యలు చేపట్టకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని బొల్లారం మున్సిపాలిటీ బిజెపి నాయకులు కేజేఆర్ కృష్ణా రెడ్డి అన్నారు. ఆయన అమరల్యాబ్ పరిశ్రమలో ఆదివారం అర్ధరాత్రి రియాక్టర్ బ్లాక్లో మంటలు చెలరేగి తీవ్రంగా గాయపడిన కార్మికులను పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి బాధిత కుటుంబాలకు నష్ట పరిహారాన్ని అందజేస్తానని తెలిపారు. పారిశ్రామికవాడలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో కార్మికుల్లో భయాందోళనలు నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత సేఫ్టీ అధికారులు కూడా పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యాలు కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఇలాంటి సంఘటనలకు ఆజ్యం పోస్తున్నాయి అన్నారు. పారిశ్రామిక వాడలోని చాలా కంపెనీల్లో భద్రతా చర్యలు శూన్యమన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement