Friday, October 4, 2024

MDK: టిప్పర్ ఢీకొని… ఒకరు మృతి…

ప్రభ న్యూస్, గుమ్మడిదల : టిప్పర్ అతివేగంగా వెళ్తూ రోడ్డుపైన‌ ట్రాన్స్ ఫార్మర్ వద్ద నిలుచున్న వ్యక్తిని ఢీ కొట్టడంతో మృతిచెందిన సంఘటన గుమ్మడిదల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గుమ్మడిదల మండల కేంద్రానికి చెందిన పాటక్ సంజీవ రెడ్డి పొలం వద్దకు వెళ్లి వస్తుండగా ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఫ్యూజ్ లను పరిశీలిస్తున్న సమయంలో గుమ్మడిదల నుండి టోల్గేట్ వైపు మట్టి లోడుతో వస్తున్న టిప్పర్ అతివేగంగా వచ్చి పాఠక్ సంజీవ రెడ్డిని ఢీ కొట్టడంతో అతనికి బలమైన గాయాలు కాగా… చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా… మృతిచెందినట్లు ఆస్పత్రి వారు తెలిపారు. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సీపీఐ లో కీలక భూమిక పోషించిన వ్యక్తి సంజీవ రెడ్డి….
సీపీఐ పార్టీలో దివంగత నేత అప్పటి ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి పనిచేసిన వ్యక్తి పాఠక్ సంజీవ రెడ్డి సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో బడుగు బహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేసిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. అలాగే ఇప్పటికీ ఎలాంటి పార్టీలు మారకుండా పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన మృతి పార్టీకి తీరనిలోటని ఆపార్టీ శ్రేణులు సంతాపం తెలియజేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement