Sunday, October 6, 2024

MDK: గురుకుల పాఠశాల భవనంపై నుండి పడి.. విద్యార్థినికి తీవ్రగాయాలు

జహీరాబాద్, జులై 8 (ప్రభ న్యూస్) : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం, అల్లాపూర్ శివారులో గల తెలంగాణ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని హాస్టల్ భవనంపై నుండి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.

విద్యార్థిని రాయికోడ్ మండలం ఈసుపూర్ గ్రామానికి చెందిన పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని కింద పడటంతో నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన స్థానిక జహీరాబాద్ లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement