చేగుంట : ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉచిత రేషన్ బియ్యాన్ని చేగుంట మండల కేంద్రంలో అందజేశారు. తహశీల్దార్ విజయలక్ష్మీ సమక్షంలో చేగుంట రేషన్ షాప్లో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ పంపిణీ ప్రారంభించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి గమనించి ప్రభుత్వం రేషన్ బియ్యంతో పాటు రెండు వేల రూపాయల నగదును అందజేసేందుకు నిర్ణయించింది. దీంతో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డీలర్లు సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement