Monday, July 1, 2024

MDK: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ప్రభ న్యూస్, గుమ్మడిదల : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందిన సంఘటన గుమ్మడిదల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుమ్మడిదల బస్టాండ్ ఆవరణలో 30నుంచి 35ఏళ్ల‌లోపు వ‌య‌సు గల మగ వ్యక్తి మృతి చెంది ఉన్నాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు వెళ్లి పరిశీలించగా.. వ్యక్తి చనిపోయి ఉన్నట్టుగా నిర్ధారించడం జరిగింది. శవం కుడి చేతిపై త్రిశూలం ఆకారంలో పచ్చబొట్టు కలదు. ఈ వ్యక్తి గురించి ఎలాంటి సమాచారం తెలిసినా ఈ కింది ఫోన్ నంబర్లను సంప్రదించ వలసిందిగా వారు సూచించారు. సిఐ జిన్నారం-8712656730, ఎస్ఐ గుమ్మడిదల-8712656751లను సంప్రదించాలన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement