Monday, October 14, 2024

నాగార్జునసాగర్‌ లో ఇంటింటి ప్రచారం..

తూప్రాన్ : నాగార్జునసాగర్‌ లో జరిగే ఉప ఎన్నికలో బిజెపి జెండా ఎగరవేస్తామని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు వర్గాంటి రాంమోహన్‌గౌడ్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్‌ ఎన్నికల ప్రచారం కోసం మెదక్‌ జిల్లా బిజెపి అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిడమానూర్‌ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. నాగార్జునసాగర్‌ ప్రజలు బిజెపికి పట్టం గట్టేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల్లో తెరాస ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపిపి, జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు యాదగిరి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement