Sunday, September 8, 2024

కోనాయ‌ప‌ల్లి వెంక‌టేశ్వ‌ర స్వామి పూజ‌ల్లో మంత్రి హ‌రీశ్ రావు

వేకువ జామునే రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప‌ట్టువ‌స్త్రాలు ధ‌రించి ఇష్ట దైవమైన కొనాయపల్లి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంకు విచ్చేశారు. పండుగ వాతావరణంలో జరిగిన ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా వేద పండితుల సమక్షంలో జరిగిన హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement